ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు దీపావళి గిఫ్ట్ అందించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం పొందిన 75వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా శనివారం పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే రోజ్ గార్ మేళా రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ యువత కోసం అత్యధిక ఉద్యోగాలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తొందన్నారు. కోవిడ్ అనంతరం ప్రపంచ దేశాల పరిస్థితులు అంత బాగా ఏమీ లేవని అన్నారు. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్య శిఖర స్థాయిలో ఉందని చెప్పారు. వందేళ్లకు ఒక సారి వచ్చే మహమ్మారి ప్రభావం వంద రోజుల్లో అంతం కాబోదని అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు మన దేశంపైనా ఏ విధంగా ఉందో వివరించారు.
ప్రపంచ మంతా ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ ప్రభావం అన్ని దేశాలపై ఉంటోందని పీఎం మోడీ అన్నారు. అయితే ఈ సమస్య ప్రభావం పడకుండా మన దేశాన్ని కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం అనేక నూతన చర్యలను చేపడుతోందని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని రిస్క్ లను కూడా చేస్తొందని తెలిపారు. మన దేశంపై ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇది సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని, ప్రజల ఆశీర్వాదంతో మనం ఇప్పటికీ సురక్షితంగా ఉన్నామని పీఎం మోడీ పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ విభాగంలో 75 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన మోడీ.. భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు, డిపార్ట్ మెంట్ లలో వీరు పని చేస్తారని చెప్పారు, దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఈ ఉద్యోగాలకు ఎంపికైయ్యారు.