PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ శతవసంతంలోకి అడుగుపెట్టారు. తన తల్లి వందవ పడిలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ .. నేడు గాంధీ నగర్ లో ఉంటున్న తల్లి ఇంటికి వెళ్లారు. తన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లితో కలిసి పూజలో పాల్గొన్నారు. పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెకు మిఠాయిలు తినిపించారు. కొద్ది సేపు సరదాగా తల్లితో ముచ్చటించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వందవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా … తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ ఓ బ్లాగ్ రాసిన మోడీ తన తల్లికి అంకితం చేశారు. మాతృమూర్తికి మోడీ పాదపూజ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో పక్క మోడీ స్వస్థలమైన వడ్ నగర్ లో తల్లి హీరాబెన్ చిరకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi met his mother Heeraben Modi at her residence in Gandhinagar on her birthday today.
Heeraben Modi is entering the 100th year of her life today. pic.twitter.com/7xoIsKImNN
— ANI (@ANI) June 18, 2022
Took blessings of my mother today as she enters her 100th year… pic.twitter.com/lTEVGcyzdX
— Narendra Modi (@narendramodi) June 18, 2022