PM Modi: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అనంతపురం జిల్లా ఉరవరకొండ మండలం బూదగవి సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లా బీజేపీ నేత కోకా వెంకటప్ప నాయుడు(58) కుమార్తె వివాహం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఆదివారం ఉదయం జరిగింది. వివాహా వేడుక అనంతరం వెంటప్పనాయుడు బంధువులతో కలిసి ఇన్నోవా కారులో స్వగ్రామం వస్తుండగా ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న పెద్ద లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటప్పనాయుడుతో సహా ఇన్నోవా కారులో ఉన్న ఆయన బంధువులు మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకమునుపే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
PM Modi: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రజలు ప్రాణాలో కల్పోవడం బాధాకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి చెల్లిస్తామని ప్రధాన మంత్రి మోడీ వెల్లడించారు.
Read More:CM YS Jagan: నేడు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపి సీఎం వైఎస్ జగన్..
ప్రమాదంలో మృతులు
ఈ ప్రమాదంలో కోకా వెంకటప్ప నాయుడుతో పాటు ఆయన బంధువులు బొమ్మనహల్ మండల కేంద్రానికి చెందిన సరస్వతి (60), ఆమె కుమారుడు అశోక్ (35), కుమార్తె స్వామి (38), పిల్లలు స్వాతి, జాహ్నహి (12), జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ (48), రాయలప్పదొడ్డికి చెందిన సుభద్రమ్మ (60), పిల్లలపల్లికి చెందిన శివమ్మ (35) మృతి చెందారు. వీరి మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా PMNRF నుండి చెల్లిస్తాం: ప్రధానమంత్రి @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2022