PM Modi: యోగాను ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. యోగా ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని తెలిపారు.
“కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి మూల లక్షలాది మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్షిత కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా మంచి ఆరోగ్యం సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.
Addressing the #YogaDay programme. https://t.co/tHrldDlX5c
— Narendra Modi (@narendramodi) June 21, 2021