మోదీ గారూ.. మీ మాటలు, ఫొటోలు, ప్రచారాలు, మన్ కీ బాత్ ఆర్భాటాలు అన్నీ ఓకే. కానీ.. దేశం ఓ ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోంది. రూపాయి విలువ తగ్గిపోతోంది. జీడీపీ అత్యంత దిగువకు దిగజారిపోతోంది. మీరు దేశ ఆర్ధిక పరిస్థితిని చూస్తున్నారా.. లేక కేవలం మీ ప్రచారమేనా.. చూసుకుంటున్నారా..? కనీసం దేశ ఆర్ధిక పరిస్థితిని స్కాన్ చేసో.. జిరాక్స్ తీసో చూస్తున్నారా..? కేంద్ర ఆర్ధిక మంత్రి ఏం చేస్తున్నారో అర్ధమవుతోందా..? మోదీ గారూ కాస్త ఆవైపు పట్టించుకోండి.
రికార్డు స్థాయిలో కుదేలవుతోన్న జీడీపీ..
ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా విలయంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో భారీగా క్షీణత నమోదైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం అధికారిక గణాంకాలు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో 5.2 శాతం వృద్ధి రేటు నమోదైతే 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జీడీపీ 3.1 శాతంగా వృద్ధి నమోదైంది. 1996లో భారతదేశం తొలి త్రైమాసిక గణాంకాలు ప్రచురించింది. అప్పటినుంచీ చూస్తే ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది. జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉంది. అనుకూలమైన రుతుపవనాలు, నిండిన జలాశయాలలో నీటి లభ్యత, ఖరీఫ్ విత్తనాలు, పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సేకరణ బలమైన రబీ ఉత్పత్తి వ్యవసాయ వృద్ధికి తోడ్పడినట్లు తెలుస్తోంది.
ఆర్దికమంత్ర ఏం చేస్తున్నట్టు..
జీడీపీ ఇంతగా పోతూ ఉంటే దేశంలో ఆర్ధికమంత్రి ఉనట్టా లేనట్టా..? ఉంటే ఏం చేస్తున్నట్టు. అప్పట్టలో కరోనా సమయంలో 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ.. మూడు రోజులపాటు ప్రెస్ మీట్లు, ప్రచారంతో హోరెత్తించారు. దేశాన్ని ఆర్ధిక భారాన్ని నెత్తిన పెట్టుకుంటున్నట్టు మాటలు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా నిర్మలా సీతారామన్ ఆర్ధికమంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.