NewsOrbit
న్యూస్

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన ఇలా.. ప్రత్యేకత ఏమిటంటే..?

PM Modi: బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Modi) తెలంగాణ (Telangana)రాజధాని హైదరాబాద్ నగరానికి రానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా (JP Nadda) ఈ మధ్యాహ్నమే హైదరాబాద్ (Hyderabad) చేరుకోనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండే విధంగా షెడ్యుల్ ఖరారు అయ్యింది. జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ప్రధాని మోడీ ఏపి లో పర్యటించనున్నారు. ప్రధాన పర్యటన నేపథ్యంలో బస, పర్యటన, భద్రతా ఏర్పాట్లు చేశారు.

PM Modi TS AP Tour
PM Modi TS AP Tour

PM Modi: రేపు ఎల్లుండి హైదరాబాద్ లోనే..

ప్రధాన మంత్రి మోడీ పర్యటన షెడ్యుల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరతారు. 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. 3 గంటలకు హెలికాఫ్టర్ లో హెచ్ఐసీసీ నోవాటెల్ కి వెళతారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. రాత్రి నోవాటెల్ హోటల్ లోనే బస చేయనున్నారు. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా జూలై 3న ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని హజరవుతారు. సాయంత్రం వరకూ సమావేశాల్లోనే పాల్గొంటారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధానితో పాటు పార్టీ ముఖ్యనేతలు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ తిరిగి నోవాటెల్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 4వ తేదీ ఉదయం బయలుదేరి ఏపిలోని భీమవరం చేరుకుంటారు.

భీమవరంలో..

ప్రధాన మంత్రి నరేంద్ర రాకను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పెదఅమిరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 4న ఉదయం 9.15 గంటలకు బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాఫ్టర్ లో భీమవరం చేరుకుంటారు. భీమవరంలోని ఎఎస్ఆర్ పార్క్ లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలో అల్లూరు సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.  మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రధాన మంత్రి మోడీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదివేల మంది విధులు నిర్వహిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!