PM Modi: బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Modi) తెలంగాణ (Telangana)రాజధాని హైదరాబాద్ నగరానికి రానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా (JP Nadda) ఈ మధ్యాహ్నమే హైదరాబాద్ (Hyderabad) చేరుకోనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండే విధంగా షెడ్యుల్ ఖరారు అయ్యింది. జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ప్రధాని మోడీ ఏపి లో పర్యటించనున్నారు. ప్రధాన పర్యటన నేపథ్యంలో బస, పర్యటన, భద్రతా ఏర్పాట్లు చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
PM Modi: రేపు ఎల్లుండి హైదరాబాద్ లోనే..
ప్రధాన మంత్రి మోడీ పర్యటన షెడ్యుల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరతారు. 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. 3 గంటలకు హెలికాఫ్టర్ లో హెచ్ఐసీసీ నోవాటెల్ కి వెళతారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. రాత్రి నోవాటెల్ హోటల్ లోనే బస చేయనున్నారు. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా జూలై 3న ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని హజరవుతారు. సాయంత్రం వరకూ సమావేశాల్లోనే పాల్గొంటారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధానితో పాటు పార్టీ ముఖ్యనేతలు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ తిరిగి నోవాటెల్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 4వ తేదీ ఉదయం బయలుదేరి ఏపిలోని భీమవరం చేరుకుంటారు.
భీమవరంలో..
ప్రధాన మంత్రి నరేంద్ర రాకను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పెదఅమిరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 4న ఉదయం 9.15 గంటలకు బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాఫ్టర్ లో భీమవరం చేరుకుంటారు. భీమవరంలోని ఎఎస్ఆర్ పార్క్ లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలో అల్లూరు సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రధాన మంత్రి మోడీతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదివేల మంది విధులు నిర్వహిస్తున్నారు.