ప్రధాని నరేంద్ర మోది పారిశుద్ధ్య కార్మికులకు పాదసేవ చేశారు. ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, వారికి శాలువాలు కప్పి సన్మానించారు.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆదివారం పీఎం-కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోది అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు వెళ్లారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
పవిత్ర గంగానదిలో స్నానమాచరించిన అనంతరం మోది సంగం ఘాట్ వద్ద పూజలు నిర్వహించారు. కుంభమేళా ఉత్సవాల్లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను కలుసుకున్నారు.
అంకిత భావంతో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సేవలను మోది కొనియాడారు. ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, వారికి శాలువాలు కప్పి సన్మానించారు.
అనంతరం జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ్ కుంభ్-స్వచ్ఛ్ ఆభార్’ కార్యక్రమంలో మోది పాల్గొన్నారు. కుంభమేళాలో విశేష సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లు, పోలీసు అధికారులకు స్వచ్ఛ్ కుంభ్-స్వచ్ఛ్ ఆభార్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు మోది తెలిపారు.
‘స్వచ్ఛ భారత్’ కలను ముందుకు తీసుకెళ్లడంలో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, ఇందుకు సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మోది అన్నారు.