బీహార్ ఎన్నికలు మూడోవ దశకు చేరుకున్నాయి. నవంబర్ 7 న జరిగే చివరి దశ ఎన్నికలలో ఎన్డీయేకు వోట్ వేయాల్సిందిగా పీఎం మోడీ బీహార్ ప్రజలకు హిందీలో బహిరంగ లేఖ రాశారు. బీహార్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మోడీ, ఎన్డీయేకు వోట్ వేసి గెలిపించాలి అన్ని లేఖలో పెరుక్కొన్నారు.
बिहार के भाइयों और बहनों के नाम मेरा पत्र… pic.twitter.com/QZ2qOlF8XD
— Narendra Modi (@narendramodi) November 5, 2020
బీహార్ లోని అభివృద్ధి పథకాలకి ఆటంకం రాకుండా ఉండటానికి,నితీశ్కుమార్ ప్రభుత్వం అవసరం అని మోడీ లేఖలో తెలిపారు. భాజపా ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, బిహార్లో జేడీయూ- భాజపా ప్రభుత్వాలను రెండు ఇంజిన్ల శక్తిగా పేర్కొన్న మోడీ, దీని వల్ల రానున్న దశాబ్దకాలంలో బిహార్ అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను చేరుకుంటుందని వివరించారు. బీహార్ ప్రజలు అభివృద్ధి, శాంతి భద్రతలు, నిజాయతి, స్వయం సమృద్ధికి వోట్ వేస్తున్నట్లు మోడీ లేఖలో పెరుక్కొన్నారు.
2005 లో ఎన్డీయే ప్రభుత్వం గెలిచాక, బీహార్ లో అభివృద్ధి జరగడం మొదలు అయింది అన్ని మోడీ తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు,సామాజిక ఆర్ధిక అభివృద్ధితో పాటు శాంతిభద్రతల నిర్వహణ సమర్ధంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని అన్నారు. ఎన్డీయే మాత్రమే స్నేహపూర్వకంగా బీహార్ అభివృద్ధికి కృషి చేస్తుంది అన్ని మోడీ తన లేఖ ద్వారా బీహార్ వోటర్లకి విన్నవించుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో చివరి రోజున పూర్ణియా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ “‘బిహార్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా” అంటూ నితీష్ తేల్చి చెప్పారు. ఇప్పటకే రెండు దశలు ముగిసిన ఎన్నికలు నవంబర్ 7 మూడోవ దశ జరగనున్నది. నవంబర్ 10 న ఫలితాలు తేలనున్నాయి.