ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ ద్వారానే అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక విధంగా సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ప్రస్తుతం ఎదురవుతున్నాయి. ఆన్లైన్ కేంద్రంగా చాలామంది కోటీశ్వరులు దివాలా తీసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని అనవసరమైన యాప్ లలో అప్పులు తీసుకున్న వారు డబ్బులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఒక లావాదేవీల మాత్రమే కాక వస్తువులను కూడా ఆన్ లైన్ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా వారణాసిలో ప్రధాని మోడీ ఆఫీస్ ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేశారు కేటుగాలు. ఈ ఆఫీసుని విల్లా గా చెప్పిన దుండగులు దానిలో 4 బెడ్ రూమ్ లు, నాలుగు బాత్రూములు ఉన్నాయని తెలిపారు.
7 కోట్ల 50 లక్షల రూపాయలకు బేరం పెట్టారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో కొంతమంది ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయ అధికారులు ఓఎల్ఎక్స్ లో ఆ ప్రకటనలు తొలగించారు. అంతమాత్రమే కాకుండా ఆ ప్రకటన పెట్టిన నలుగురు నిందితుల ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోడీ వారణాసి నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గ్రామంలో వారణాసిలో పార్లమెంటరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆగస్టు 2014 సంవత్సరంలో అమిత్ షా ఓపెన్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఈ ఆఫీస్ ని ఆన్లైన్ కేటుగాళ్లు అమ్మకానికి పెట్టడం బిజెపి పార్టీ లో మాత్రమే కాక జాతీయ స్థాయిలో సంచలనం అయ్యింది.