ప్రపంచవ్యాప్తంగా ఆప్ఘనిస్థాన్ అలజడి రేపింది. తాలిబన్ల అరాచకాలకు ఆప్ఘన్ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. తాలిబన్లు విదేశీయులను తరిమికొడుతుండటతో అక్కడున్న భారతీయుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. భారతదేశానికి ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియన్స్ తీసుకొచ్చే ఆపరేషన్ కు దేవి శక్తిగా పేరు పెట్టారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు.
Oats: డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు ఇవి గుప్పెడు తింటే చాలు..!!
తాజాగా 78 మంది ఇండియన్స్ ను కాబూల్ నుంచి ఇండియాకు చేర్చారని తెలిపారు. ఆ విధంగానే భారతీయ వాయుసేన, ఎయిరిండియా కలిసి స్వదేశానికి ఆప్ఘనిస్థాన్ నుంచి ప్రజలను చేర్చుతున్నట్లు మంత్రి జయశంకర్ తెలిపారు. ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. తాలిబన్లు ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో ప్రజల పరిస్థితి అంధకారంగా మారింది. ఆ దేశంలో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి చేర్చుతోంది. తాజాగా ఆ ఆపరేషన్ కు దేవి శక్తి అనే పేరును పెట్టింది.