ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వంద సంవత్సరాలు ఉన్న హీరాబెన్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అహమ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హీరాబెన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. అకస్మాత్తుగా ఆమె ఆనారోగ్యానికి గురవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వెంటనే వైద్య సేవలు అందించారు.
అయితే అనారోగ్యంతో బాదపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ మోడీ అహ్మదాబాద్ ఉండటంతో ఆసుపత్రితో పాటు అహ్మదాబాద్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ రోజున అహ్మదాబాద్ కి చేరుకున్న ప్రధాని మోడీ తన తల్లిని కలిశారు. ఆమెతో ఆప్యాయంగా గడిపారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరాబెన్ తన 100వ జన్మదిన వేడుకలను ఈ ఏడాది జూన్ నెలలో జరుపుకున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆసుపత్రికి చేరుకుని హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీఎెం భూపేంద్ర పటేల్ కొద్దిసేపటిలో ఆసుపత్రికి చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?