న్యూఢిల్లీః అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఈ రోజు ఉదయం జైట్లీ నివాసానికి వెళ్లారు. జైట్లీ భార్య, కుమారుడు రోషన్లను పరామర్శించి ఓదార్చారు.
జైట్లీ గత శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. జైట్లీ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన పర్యటన రద్దు చేసుకుని భారత్కు రావాలని భావించారు. అయితే విదేశీ పర్యటన అర్ధంతరంగా రద్దు చేసుకోవద్దని జైట్లీ కుటుంబసభ్యులు మోదీని కోరడంతో.. ప్రధాని తన పర్యటనను కొనసాగించారు. జైట్లీ అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. అయితే, మోదీ నేడు స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత.. జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు.
previous post