ప్రముఖ కవి, సాహితీవేత్త, సామాజిక కార్యకర్త వరవరరావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. వరవరరావు వయసు 81 సంవత్సరాలు. ఆయన 2018 నుండి ఎల్గార్ పరిషద్ కేసు కారణంగా జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే నిన్నటి నుండి మైకంగా ఉందని వరవరరావు చెబుతున్న కారణంగా ఆయన్ను జెజె ఆసుపత్రికి తరలించి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొంత కాలంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, జైల్లోనే ఆయన్ను ఉంచవద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బెయిల్ కోసమే ఇదంతా చేస్తున్నారని అనుకుని పోలీసులు కావాలనే ఆసుపత్రికి తరలించట్లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే నిన్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తరలించి టెస్టులు చేయగా కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?