ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కొత్తపేట లో హైవేలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పంట ఉత్పత్తులను ప్రభుత్వమే రైతుల దగ్గర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క కొత్తపేట లో వాటర్ ట్యాంక్ ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా.. అదే నియోజకవర్గానికి చెందిన రేవంత్ రెడ్డిని పిలవకుండా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి.
టిఆర్ఎస్ పార్టీ మంత్రులకి కనీస ఇంగిత జ్ఞానం లేదు అంటూ తనని ఆహ్వానించకపోవడం పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో అదే ప్రజలు ఎన్నుకున్న నాయకులను పిలవకపోవడం దారుణమని.. ఫామ్ హౌస్ నుంచి తెచ్చిన డబ్బులతో ఈ కార్యక్రమాలు చేయటం లేదు కదా అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
సోషల్ మీడియాలో కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో పోలీసులు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కొత్తపేట హైవే ప్రాంతంపై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ జెండా ని చించేసి టిఆర్ఎస్ నాయకులు నానా హడావిడి చేయడం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.