అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతలు ఆందోళన చేస్తున్న వేళ.. అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అమరావతికి భూములిచ్చిన తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నలుగురు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. అకారణంగా పోలీసులు తమను అరెస్టు చేస్తున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దాటాక తమ ఇళ్లలోకి పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేపట్టారని, అక్రమంగా పలువురిని అరెస్టు చేసి తీసుకెళ్లారని రైతులు చెప్పారు. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని ఆరోపించారు. పోలీసుల చర్యతో రైతులు ఆందోళన చెందుతున్నారని, అరెస్టు చేసిన రైతులను వెంటనే విడిచిపెట్టకపోతే పీఎస్ ఎదుట ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?