ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పైశాచికత్వం అంతకంతకూ పెరుగుతోంది. ఈ కష్ట కాలంలో రక్షణా కవచాలుగా ఉండాసిన వారే కాలయములుగా మారి ప్రజలను ఇష్టం వచ్చినట్ళు కొడుతున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంసి. మాస్కు ధరించ లేదన్న కారణంపై చీరాల టూటౌన్ ఎస్సై విజయ కుమార్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చీరాల థామస్ పేటకు చెందిన కిరణ్ అనే యువకుడు మరణించాడు.
గుంటూరు లలితా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కిరణ్ మృతి చెందాడని సమాచారం. కొత్తపేట పంచాయితీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న ఎస్సై ఆ మార్గంలో ఆదివారం నాడు మాస్కు లేకుండా బైక్పై వస్తున్న కిరణ్ ని కొట్టగా అతను తీవ్రంగా గాయపడ్డాడు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో గుంటూరు తరలించారు.చికిత్స పొందుతూకిరణ్ మరణించాడు.
ఈ వార్త తెలియగానే చీరాల పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంకా దీని పై ఉన్నత పోలీసు అధికారులు మరియు రాజకీయ నాయ్కులు స్పందించాల్సి ఉంది.