టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలలో నటించి కనువిందుచేసి కనుమరుగైపోయిన యువ హీరో విశ్వంత్పై ఇటీవల ఓ ఛీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు విశ్వంత్ తక్కువ ధరకు మంచి కార్లను ఇప్పిస్తానంటూ కొందరు దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మోసపోయామని తెలియడంతో వారంతా పోలీసులను ఆశ్రయించి జరిగినదంతా వారికి వివరించారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులు హీరో విశ్వంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
విశ్వంత్ ఇలా చాలా మందిని నమ్మించి మోసం చేశాడని పోలీసులు చెబుతున్నారు. భాదితులు అందరూ తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరంచేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తేలియాలిసి ఉంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమాలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించి తన కెరీర్ను ప్రారంభించాడు. విశ్వంత్ అసలు పేరు విశ్వనాథ్. విశ్వంత్ ఆంధ్ర ప్రదేశ్ కాకినాడలోని సామర్లకోటలో పుట్టాడు. విశ్వంత్ పదో తరగతి వరకు విశాఖపట్టణంలో చదువుకున్నారు. ఆ తరువాత ఇంటర్ హైదరాబాద్లో చదివి ఇంజనీరింగ్ లో డిగ్రీని కోయంబత్తూరు లో పూర్తి చేసాడట.
ఇంజనీరింగ్ తరువాత అతను ఉన్నత చదువుల కోసం అమెరికా కు వెళ్లగా దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో నటించే అవకాశం రావడంతో తిరిగి ఇండియా వచ్చాడట. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ తీసుకురాలేకపోయినా విశ్వంత్కు మాత్రం గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత అతను మోహన్ లాల్, గౌతమి నటించిన ‘మనమంతా’ సినిమాలో కనిపించాడు. ఈమధ్య కాలంలో వచ్చిన ‘ఓ పిట్టకథ’ సినిమాలో కనిపించగా సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్లోనూ విశ్వంత్ నటించాడు.