YS Jagan: టీడీపీ(TDP) అధికార ప్రతినిధి పట్టాభి(Pattabhi) ఇటీవల సీఎం జగన్ ని (CM Ys Jagan) ఉద్దేశించి బోసిడికే… చేతగాని వాడు, పాలెగాడు అంటూ ఏకవచనంతో పరుష పదజాలంతో విమర్శలు చేయడం తెలిసిందే. దీంతో వైసీపీ(YCP) పార్టీ శ్రేణులు… ముఖ్యమంత్రి పట్ల పట్టాభి మాట్లాడిన తీరును ఖండించడం జరిగింది. కాగా తాజాగా సీఎం జగన్ విజయవాడ(Vijaywada) ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. పోలీసుల అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. పోలీసులు గురించి ఇంకా అనేక విషయాల గురించి ముందు మాట్లాడి తర్వాత.. ఇటీవల..టీడీపీ పార్టీ నాయకులు తనని ఉద్దేశించి బోసిడికే అనే పదాన్ని వాడటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రసంగించారు.
జగన్ ఏమన్నారంటే… ముఖ్యమంత్రిని తిట్టడం కరెక్ట్ ఏనా..? అని ప్రశ్నించారు. ప్రస్తుత సమాజంలో నేరగాళ్లు రూపం మార్చుకున్నారు. గిట్టని మనిషి అధికారంలో ఉన్నాడు అని.. ప్రతిపక్షాలు ఓర్వ లేక పోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రం పరువు ప్రతిష్టలను తీయడానికి కూడా వెనుకాడడం లేదు. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం నా ఒక్కడి పై జరుగుతున్న దాడి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పై జరుగుతున్న దాడి అని జగన్ అభివర్ణించారు. ఇది అనైతికం.. అధర్మమని అన్నారు. డ్రగ్స్ విషయంలో కేంద్రం ఏపీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన మరోపక్క ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(Ap DGP Gowtham Sawang) విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు డ్రగ్స్ విషయంలో… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్న గాని.. ప్రతిపక్షాలు నోరు అదుపులో పెట్టుకోవడం లేదని అన్నారు.
తల్లి ని ఇంత దారుణంగా బూతులు
ఈ క్రమంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టిపరిస్థితిలో రాజీపడే ప్రసక్తి లేదని సీఎం జగన్(CM Jagan) స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పోలీసులు ఎక్కడా రాజీ పడొద్దు అని తప్పు చేస్తే ఎవరిని.. ఉపేక్షించేది లేదని చిన్న పెద్ద అనే తేడా లేదని తెలిపారు. ఇదే క్రమంలో బోసిడికే అంటే అర్థం ల*కొడుకు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని ఆయన తల్లి ని ఇంత దారుణంగా బూతులు తిట్టడం పట్ల జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల.. రాష్ట్రంలో.. సీఎం ను అభిమానించే వాళ్ళు.. రెచ్చిపోవాలి..తిరగబడాలి.. దాని వల్ల రాష్ట్రంలో గొడవలు సృష్టించి పొలిటికల్ మైలేజ్ సంపాదించాలని ప్రతిపక్షాలు ఆరాట పడుతున్నాయని ఆరోపించారు.
రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులు …
అధికారం దక్కలేదని చివరాకరికి కులాల మధ్య మతాల మధ్య కూడా..గొడవలు సృష్టించడానికి.. ఏమాత్రం వెనకాడటం లేదని.. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించింది అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు అంటూ సీఎం జగన్ పోలీసుల సంస్మరణ సభలో తెలియజేశారు. ఇంకా ఇదే సభలో జగన్ మాట్లాడుతూ.. ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా 377 మంది.. అమరులు అయితే అందులో మన రాష్ట్రానికి చెందిన వాళ్లు 11 మంది ఉన్నారు. వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను అని పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు…
అంతమాత్రమే కాకుండా.. కరోనా కారణంగా ఆపేసిన వీక్లీ ఆఫ్.. నేటి నుండి అమలులోకి రానుంది అని.. జగన్(Jagan) స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామని కరోనా కారణంగా చనిపోయిన పోలీసులకు పది లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అంత మాత్రమే కాక కరోనా(Corona) బారిన పడిన పోలీసులకు ప్రత్యేక సేవలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.