దక్షిణ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు అధికారి ఈ ఘటనలో మృతి చెందారు.
శ్రీనగర్ కు 68 కిలోమీటర్ల దూరంలో కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల సంచారం ఉందనే సమాచారం మేరకు భద్రతా దళాలు ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల స్థావరాన్ని చుట్టుముట్టిన భద్రత దళాలు ఎదురు దాడికి దిగాయి.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో డిఎస్పి అమన్ కుమార్ ఠాకూర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు, ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు.