యాచకులు అంటే మాసిన బట్టలు, చింపిరి జుట్టు వేసుకుని రోడ్ల దగ్గర అడుక్కునే వారనే చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళను ఒక్కసారి తడిమితే.. వాళ్ళు పడే మనోవేదన, వాళ్లకు జరిగిన అన్యాయాలు తెలుస్తాయి. ఆ యాచకుల్లో కొందరు ఎంతో గొప్ప జీవితాలను గడిపిన వారు కూడా ఉంటారు. లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కొందరు యాచకుల్లా మరిపోవాల్సి వస్తుంది. మరి కొందరు మతిస్థిమితం కోల్పోయి.. ఎక్కడో తప్పిపోయి యాచకుల్లా మారిన వారూ ఉంటారు.
అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. ఆ యాచకునిల మారిన వ్యక్తి మనకు తెలిసిన వారు అయితే ? అలాగే తను గొప్పగా బతికిన వ్యక్తి అయితే ? ఇప్పుడు యాచకునిగా బతుకుతున్నాడని తెలిస్తే.. మనకు ఎలా ఉంటుంది? ఒకవైపు బాధ మరో వైపు దుఃఖం వస్తుంది కదా.. అలాంటి ఘటనే ఈ మధ్య ఒకటి జరిగింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రోడ్డు పక్కగా ఉన్న చలిలో వణుకుతున్న ఒక యాచకుడిని చూసాడు డీఎస్పీ రత్నేష్ సింగ్. ఆ యాచకుణ్ణి ఆదుకుందామని దగ్గరకు వెళ్ళగానే అతన్ని చూసి ఆశ్చర్య పోయాడు. యాచకుడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి తన బ్యాచ్ ఆఫీసర్ అని గుర్తించాడు. కానీ ఆ వ్యక్తి గత పదేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. అతని పేరు మనీష్ మిశ్రా అని తెలిపాడు. 1999 బ్యాచ్ పోలీసు ఆఫీసర్. ఆయన ఎస్పీగా పలు పోలీసు స్టేషన్లలో పనిచేశాడని తెలిపాడు.
2005లో చివరిగా దతియాలో పని చేశాడని డీఎస్పీ రత్నేష్ తెలిపారు. తరువాతి ఆయన మానసికంగా బాగలేరని తెలిపాడు. వారి కుటుంబ సభ్యులు చికిత్స అందించేవారని తెలిపాడు. ఒకరోజు ఏటో వెళ్లిపోయాడని, తర్వాత ఎంత వెతికిన ఆయన కనిపించలేదని తెలిపాడు. అలాంటి ఆయన ఇప్పుడు కనిపించడం వల్ల చికిత్స కోసం ఒక స్వచ్చంధ సంస్థ లో చేర్పించారు.