కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కేసులో దర్యాప్తునకు హర్యానా ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చింది.
2008 నాటి ఈ కేసులో రాబర్ట్ వాద్రా, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయిన సంగతి తెలిసిందే. కాగా రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని రాబర్ట్ వాద్రా ఆరోపిస్తున్నారు.