Petrol : ప్రస్తుతం దేశంలో సామాన్యులని అత్యధికంగా పట్టి పీడిస్తున్న అంశం ఏదన్నా వుంది అవి పెట్రోల్ ధరలే. దేశమంతటా పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోవడంతో సామాన్యులకి అది పెను భారంగా తయారవుతోంది. దగ్గర దూర ప్రయాణాలను చేయలేని పరిస్థితి నెలకొంది. వాహనాలు బయటకు తీయాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. ఇది వరకు కాస్త దూరానికి కూడా బండి తీసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అత్యవసరం అయితే తప్ప బండిని బయటకు తీయని పరిస్థితి.
Petrol :కేవలం రు.1/-కే లీటర్ పెట్రోల్?
డీసెల్, పెట్రోల్ ధరలు నేడు అంతకంతకీ పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా లీటర్ పెట్రోల్ ధర రూ.120కి కూడా పెరిగిన క్రమంలో కేవలం రు 1/-కే లీటర్ పెట్రోల్ ఇస్తామని ఓ ప్రెటోల్ బంక్ యాజమాన్యం చెప్పింది. దాంతో అక్కడికి జనం ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిన్న అనగా ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్ర సోలాపూర్లో ఓ పెట్రోల్ బంకులో కేవలం రు.1/-కే లీటర్ పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. ఇందుకు కొన్ని షరతులు కూడా పెట్టారు.
షరతులు ఇవే:
మొదటగా వచ్చిన 500 మందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పడంతో ఆ ప్రాంతంలోని వారే కాకుండా ఎక్కడెక్కకడి నుంచో అక్కడ తరలివచ్చారు ప్రజలు. ఈ క్రమంలో పెట్రోల్ బంకు ఎదుట పెద్ద ఎత్తున క్యూ కట్టడంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. అంతకంతకూ రద్దీ పెరుగుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి పెట్టారు. పెను భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని సందేశం ఇచ్చేందుకే ఇలా చేశామని బంక్ యాజమన్యం ఇక్కడ చెప్పడం అభినందనీయం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆయిల్ ధరలు తగ్గించాల్సిందిగా కోరుకుందాం.