Wrestler Murder Case: ఒక హత్య కేసులో అనుమానితునిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో జాతీయ జూనియర్ మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ రానా హత్యలో సుశీల్ కుమార్ పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసుకు సంబంధం ఉంది కాబట్టే సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి అజయ్ ను పట్టిస్తే రూ.50వేలు ఇస్తామని రివార్డు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే?ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఘర్షణలో 24 ఏళ్ళ ఓ రెజ్లర్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో భారత ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పాత్ర ఉందని పోలీసులకు సమాచారం అందగా లోతుగా దర్యాఫ్తు చేపట్టారు ఆ పక్కరోజే సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు .నాలుగు వ తేదీ రాత్రి రాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న రెజ్లర్ సాగర్ కుమార్ ని వినాయక్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సాగర్ కుమార్ ఢిల్లీలో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడు. సుశీల్ కుమార్ కు చెందిన ఈ స్టేడియం బయట ఓ ఇంటిలో సాగర్ కుమార్ తో సహా మరో ఇద్దరు ఉండగా వారిని వెళ్లిపోవాలని సుశీల్ కుమార్ కోరాడని తెలుస్తోంది. కానీ ఏం జరిగిందో గానీ పరిస్థితి ఘర్షణకు దారి తీసింది.
Wrestler Murder Case: వారిలో వారే ఘర్షణ పడ్డారు!
కాగా వారెవరో తనకు తెలియదని, ఈ ఘటన చాలా పొద్దుపోయిన తరువాత జరిగిందని సుశీల్ కుమార్ . వారు ఘర్షణకు దిగినట్టు తెలియడంతో సమాచారాన్ని తానే పోలీసులకు తెలియజేశానని ఆయన అప్పట్లో మీడియాకు చెప్పాడు. తన స్టేడియానికి, ఈ ఘటనకు సంబంధం లేదని అన్నాడు. అయితే ఆ తర్వాత సుశీల్ కుమార్ పరారు కావడం ఆయనపై అనుమానాలు పెంచింది .ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు
సుశీల్ కుమార్ ఒలింపిక్స్ మెడలిస్ట్!
సుశీల్ కుమార్ పాపులర్ రెజ్లర్.. 2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు.కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.