ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ పార్టీలు సిఎం ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ మరి కొద్దిసేపటిలో ప్రారంభం అవుతున్న తరుణంలో సుప్రీం తీర్పుపైనా ఉత్కంఠ నెలకొన్నది. నిన్న ఎన్సిపి ఎల్పి సమావేశానికి గైర్హజరైన బాబన్ షిండే నేడు పార్టీ అధినేత శరద్ పవార్ నివాసానికి చేరుకున్నారు. అజిత్ పవార్ క్యాంప్ నుండి బాబన్ తిరిగివచ్చారు. మరో పక్క క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి.
ఎన్సిపి నుండి చీలి అజిత్ పవార్ వైపు చెరిన ఎమ్మెల్యేలను ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది.
సుప్రీం కోర్టులో 11.30 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా గవర్నర్ తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మూడు పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విశ్వాస పరీక్షకు గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏ విధంగా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
Maharashtra: Nationalist Congress Party (NCP) MLA Baban Shinde arrives at NCP Chief Sharad Pawar's residence in Mumbai. He did not attend the NCP Legislative Party Meeting yesterday. pic.twitter.com/7jYizGwnay
— ANI (@ANI) November 24, 2019