గత పది నెలల నుండి ఏపీలో మూడు రాజధానులు అంశం వివాదంగానే ఉంది. బిల్లుని గవర్నర్ ఆమోదించి, విషయం కోర్టుకి వెళ్లి కూడా దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. కానీ ఏ స్పష్టత లేదు. ఏపీలో రాజధాని ఏది..? కొన్ని నెలలుగా సమాధానం లేని ప్రశ్న ఇది. టీడీపీ వాళ్ళు అమరావతి అంటారు. వైసీపీ వాళ్ళు మూడు రాజధానులు అంటారు.
సామాన్యులు మాత్రం కోర్టులు చెప్తాయి అంటారు..! ఇదో ముగింపు లేని అంశంగా మారిపోయింది. ఆరున్నరేళ్ళ కిందట జరిగిన రాష్ట్ర విభజన గాయాల నుండి పూర్తిగా కోలుకోకమునుపే రాష్ట్రంలో ఇలా రాజధాని గొడవ తెరపైకి రావడం.., నెలలు గడుస్తున్నా ఏమీ తేలకపోవడంతో ఒకరకమైన గందరగోళం నెలకొంది.
రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలంటూ సీఎం జగన్ సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఏదీ స్పష్టత లేదు. అటు అమరావతి ఆగింది, ఇటు మూడు రాజధానుల అడుగులు పడడం లేదు. ఈ క్రమంలో సమాన్యులుగా ఏం భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలియజేయగలరు.
[yop_poll id=”13″]