విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముడి విగ్రహం హిందూ ఆలయాలపై ధ్వంసం ఘటన అందరికీ తెలిసిందే. ఆ ఆలయం, విగ్రహం వేదికగా రాష్ట్రంలో రాజకీయ వివాదం మొదలయింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు/ లోకేష్ కలిసి ఇలా చేయించి డ్రామాలు ఆడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తే.., దానికి సమాధానంగా 19 నెలల పాలనలో 110 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.
వైసీపీనే ఇలా హిందూ ఆలయాలపై దాడులు ప్రోత్సహిస్తుంది అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. బీజేపీ మధ్యలో మత రాజకీయాలను చేసుకుంటుంది. ఆ పార్టీ ఎదుగుదలకు ఇలా చేస్తుంది అంటూ వాదనలు వస్తున్నాయి..!? ఈ ఘటనల్లో ఎవరి వాదనను మీరు సమర్థిస్తారు..!? ఎవరి వాదనని తప్పు పడతారు..!?
[yop_poll id=”16″]