సిద్దిపేట: ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.
సర్కార్పై హత్యా నేరం కేసు నమోదు చేయాల్సి ఉందని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాల వల్ల విద్యార్థులకు ఆత్మహత్యలకు పాల్పడితే కెసిఆర్ మాత్రం ప్రగతి భవన్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ప్రభాకర్ విమర్శించారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందనీ, అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బందాలతో అణచివేస్తున్నారని ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభాకర్ పేర్కొన్నారు.