Pooja hegde: పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇక ఇప్పటికే పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక 2022లో వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్గా నటించింది పూజా హెగ్డే. ఇది ఆమె మొదటి పాన్ ఇండియన్ సినిమా. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలుండగా సంక్రాంతి కానుకగా జనవరి 14న భారి స్థాయిలో రిలీజ్ కానుంది.
ఆ తర్వాత ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆచార్య సినిమాలో హిరోయిన్గా నటించింది. ఈ సినిమాలో చరణ్ సరసన నటించిన పూజా నీలాంబరి పాత్రలో కనిపించబోతోంది. ఇలా కేవలం ఓ నెలలోపలే రెండు భారీ చిత్రాలతో రాబోతుంది. ఈ రెండు సినిమాలు గనక భారీ హిట్ సాధిస్తే ఇక పూజా క్రేజ్ మరో రేంజ్లో పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన ఓ సినిమా చేస్తున్న పూజా, రణ్వీర్ సింగ్ సరసన కూడా ఓ సినిమా చేస్తోంది. తమిళంలో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో హీరోయిన్ పూజానే.
Pooja hegde: దాదాపు సమంత ఓకే చెబుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న పూజా ఏకంగా గురూజీ త్రివిక్రం సినిమాకు తప్పని పరిస్థితుల్లో నో చెపినట్టు టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా మొదలవబోతోంది. ఇది మహేశ్ కెరీర్లో 28వ సినిమా. జనవరి నుంచి సినిమా ప్రారంభం కానుండగా ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారట. అయితే వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న పూజా డేట్స్ సర్దుబాటు చేయలేక నో చెప్పిందట. దాంతో ఇప్పుడు సమంతను తీసుకునేందుకు త్రివిక్రం ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. దాదాపు సమంత ఓకే చెబుతుందనే టాక్ వినిపిస్తోంది.