Pooja hegde : పూజా హెగ్డే టాలీవుడ్లో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఒకే ఏడాది ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశం వచ్చిందని టాలీవుడ్ కి టాటా చెప్పి వెళ్ళిపోయింది. మొహంజాదారో సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటించింది. ఈ సినిమా కోసం రెండేళ్ళు ముంబైలోనే ఉండిపోయింది పూజా హెగ్డే. అయితే ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగలడంతో ఇక కెరీర్ డైలమానే అనుకుంది. కాని అనూహ్యంగా టాలీవుడ్ లో పెద్ద సినిమాలో ఆఫర్ అందుకుంది.
దిల్ రాజు నిర్మాత.. అల్లు అర్జున్ హీరో.. హరీష్ శంకర్ దర్శకుడు. ఆ సినిమానే దువ్వాడ జగన్నాధం. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరసగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. అరవింద సమేత సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత మహర్షి సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో నంబర్ 1 ప్లేస్ లో ఉందంటున్నారు.
Pooja hegde : పూజా హెగ్డే 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుందన్న మాట వినిపిస్తోంది.
తెలుగులో రాధే శ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలున్నాయి. హిందిలో సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం అందుకుంది. విజయ్ 65గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పూజా హెగ్డే 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుందన్న మాట వినిపిస్తోంది.