మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ సహా ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. కాగా ఈ షెడ్యూల్ తో ఆచార్య మేజర్ టాకీపార్ట్ ని కంప్లీట్ చేస్తున్నాడట కొరటాల శివ. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ బాలీవుడ్ సినిమా రేంజ్ లో తెరకెక్కుతోంది.
కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాం చరణ్ ఈ సినిమాకి నిర్మాతగానే కాకుండా ముఖ్య పాత్రలో కూడా నటించబోతున్నాడు. చెప్పాలంటే మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ అని చెప్పాలి. కాగా చరణ్ ఈ సినిమా షూటింగ్ లో జనవరి నుంచి జాయిన్ కాబోతున్నాడట. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆచార్య సినిమాలో చరణ్ కి కూడా ఒక హీరోయిన్ ఉంటుందని ఆ హీరోయిన్ ఈ బ్యూటీ నే అని తెగ ప్రచారం అవుతోంది.
ఈ క్రమంలో తాజాగా రాం చరణ్ కి జంటగా ఆచార్య సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిచబోతోందని సమాచారం. పూజా హెగ్డే ఇటీవలే ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యాం కంప్లీట్ చేసింది. అలాగే అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా కూడా కంప్లీట్ కావచ్చిందట. అయితే తెలుగులో పూజా హెగ్డే ఇంకా ఏ సినిమా కమిటవకపోవడం తో ఆచార్య లో తీసుకుంటే త్వరగా చిత్రీకరణ పూర్తవుతుందని భావించి మేకర్స్ పూజా ని తీసుకుందామని భావిస్తున్నారట. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.