కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య అని అందరికీ తెలుసు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు నిర్మాత రామ్ చరణ్. అంతేకాకుండా ఈ సినిమాలో దాదాపు 40 నిమిషాల క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొనడం జరిగింది.
సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు బట్టి మెగా ఫ్యాన్స్ లో అంతకంతకూ క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే నాడు సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ పూజా హెగ్డే చిందులు వేయనున్నట్లు.. హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. గతంలో పూజ హెగ్డే రంగస్థలం సినిమాలో చరణ్ పక్కన స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి “ఆచార్య” లో కనిపించడానికి రెడీ అవుతున్నట్లు వార్త రావడం తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫిబ్రవరి నెలలో చరణ్-పూజా హెగ్డే షూట్ ప్రారంభం కానుందని ఫిలిం వర్గాలలో టాక్.