టాలీవుడ్ లో ఇప్పుడున్న ఇద్దరు స్టార్ హీరోయిన్ లో ఎవరికీ క్రేజ్ తక్కువ లేదన్న సంగతి తెలిసిందే. రెమ్యూనరేషన్ పరంగా.. సినిమాల పరంగా ఇద్దరికీ దాదాపు ఒకేరకమైన ఫేం అండ్ నేం ఉంది. టాలీవుడ్ లో లకి హీరోయిన్స్ గా టాలీవుడ్ స్టార్స్ కి భారీ హిట్స్ రావడానికి కారణం అవుతున్నారు. తెలుగులో ఏ కొత్త ప్రాజెక్ట్ మొదలవుతున్నా ముందు దర్శక, నిర్మాతల తో పాటు హీరోలు కూడా ముందు ఈ ఇద్దరి పేర్లు పరిశీలిస్తున్నారు. కుదిరితే రెమ్యూనరేషన్ ఎక్కువైనా ఆలోచించకుండా డేట్స్ లాక్ చేసుకుంటున్నారు నిర్మాతలు.
అంతగా డిమాండ్ ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన లు ఇద్దరు కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ లో నటిస్తే ఎలా ఉంటుంది. అది కూడా పాన్ ఇండియన్ లెవల్ లో లేడీ మల్టీస్టార్ అయితే ఇంకెలా ఉంటుంది. ఊహించడానికే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అలాంటి ప్రాజెక్ట్ ని సెట్ చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీ దత్ సమర్పణలో ఆయన కుమార్తెలు స్వప్న దత్.. ప్రియాంక దత్ నిర్మించబోతున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ కూడా చేశారని అన్నారు. కాని ఎందుకనో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్టు .. ఈ సినిమా వైజయంతీ మూవీస్ 50 సినిమా అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. కాగా మరోసారి లేడీ మల్టీ స్టారర్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయో ఈ సినిమా అన్ని సౌత్ భాషలలో రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్నాడట. ఇంతకముందు దుల్కర్ సల్మాన్ ఇదే బ్యానర్ లో వచ్చిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో కనిపించాడు. మరి ఈ లేడీ మల్టీస్టారర్ ప్రభాస్ సినిమాకి ముందు మొదలవబోతుందా లేద ఆ సినిమా తర్వాత మొదలవబోతుందా అన్నది చూడాలి.