Pooja hegde : పూజా హెగ్డే వరసగా తెలుగు.. హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. గత ఏడాది వరకు తెలుగు సినిమాలలోనే బిజీగా ఉన్న పూజా హెగ్డే ఈ ఏడాది హిందీ సినిమాలు అకౌంట్ లో చేరడంతో ముంబై టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంది. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలు చేస్తోంది. కాగా పూజా హెగ్డే రాధే శ్యాం కంప్లీట్ చేసిందని సమాచారం. యూవి క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా.
ఇక అఖిల్ అక్కినేని కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అన్న రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి గుచ్చే గులాబి అన్న సాంగ్ రిలిజై సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ రెండు సినిమాలు త్వరలో పూజా హెగ్డే కి సంబంధించిన పార్ట్ కంప్లీట్ చేసేస్తుందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలోనే చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుందని తెలుస్తోంది.
Pooja hegde : పూజా హెగ్డే ఈ సినిమాల తర్వాత తెలుగులో ఏ సినిమాలు కమిటయిందో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి – చరణ్ ల ఆచార్య రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 13 న ఆచార్య రిలీజ్ కానుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య నెల పైనే గ్యాప్ ఉంది. ఇక పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న రాధే శ్యాం జులై 30న వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ రకంగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు కాస్త అటు ఇటు గా నెల ఒక్కో నెల గ్యాప్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే అఫీషియల్ గా పూజా హెగ్డే ఈ సినిమాల తర్వాత తెలుగులో ఏ సినిమాలు కమిటయిందో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.