Allu arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించాల్సిన సినిమా ఐకాన్. ఈ సినిమాకి దర్శకుడు వేణు శ్రీరాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. దీనికి ముందు చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఐకాన్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడు అల్లు అర్జున్. దాంతో దిల్ రాజు బ్యానర్లోనే దర్శకుడు వేణు శ్రీరాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాతో భారీ హిట్ ఇచ్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.
దాంతో మళ్ళీ ఐకాన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. వకీల్ సాబ్ సక్సెస్ మీట్స్లోనే దర్శకుడు వేణు శ్రీరాం ఈ ప్రాజెక్ట్ గురించి హిట్ ఇవ్వడంతో పాటు తన నెక్స్ట్ సినిమా ఇదేనని తెలిపాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ను పాన్ ఇండియన్ స్థాయిలో డెవలప్ చేస్తూ కథలో కొన్ని పాన్ ఇండియన్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాడట. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జోరుగా సాగుతున్న ఐకాన్ ప్రాజెక్ట్ను త్వరలో మొదలు పెట్టేలా నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప పార్ట్ వన్ రిలీజ్ అయ్యాక ఐకాన్ను సెట్స్ మీదకి తీసుకు రానున్నారు.
Allu arjun : ఐకాన్ ప్రాజెక్ట్లో పూజా హెగ్డే – రష్మిక మందన్న..?
కాగా తాజాగా ఐకాన్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్లో ఏకంగా ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ను తీసుకోవాలని దిల్ రాజు బృందం ప్లాన్ చేస్తోంది. వారే పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఇద్దరు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇద్దరికీ పాన్ ఇండియన్ హీరోయిన్స్గా అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీ ఉంది. దాంతో ఐకాన్ ప్రాజెక్ట్లో ఇద్దరినీ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇదే నిజమైతే ప్రాజెక్ట్కి ఏ రేంజ్లో గ్రాండ్నెస్ వస్తుందో చెప్పడం చాలా కష్టం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?