టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీ హీరోయిన్ గా పూజా హెగ్డే చలామణి అవుతుంది. గత ఏడాది “అలావైకుంఠపురంలో” సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుని వరుస అవకాశాలు దక్కించుకున్న పూజా హెగ్డే, ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “రాధేశ్యామ్” అనే టాప్ ప్రాజెక్టులలో నటిస్తోంది.
పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇటీవల పూజా హెగ్డే రిలీఫ్ తీసుకోవటం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో తెలిపింది. హైదరాబాద్ నగరంలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని స్వస్థలం ముంబై నగరానికి వెళ్తున్నట్లు క్యాప్షన్ ద్వారా రాసుకొచ్చింది. మొత్తంమీద చూసుకుంటే రాధేశ్యామ్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సినిమాకి సంబంధించిన టీజర్ న్యూ ఇయర్ అదే విధంగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అవుతుందని ఎంతగానో ప్రభాస్ అభిమానులు చూడగా.. నిరాశే ఎదురైంది. కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్న తీరు బట్టి టీజర్ కూడా అతి త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది. యు.వి.క్రియేషన్స్ గోపికృష్ణ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా వీలైతే “రాధేశ్యామ్” సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.