Prabhas : ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వార్త గురించి పూజా హెగ్డే సోషల్ మీడియాలో చెప్పేసింది.
ఆ వార్త మరేంటో కాదు రాధేశ్యాం టీజర్ రిలీజ్ డేట్. ఈ సినిమా టీజర్ గురించి ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు నాడు రిలీజ్ అవుతుందని భావించారు కానీ కుదరలేదు. ఆ తర్వాత జనవరి ఫస్ట్ తర్వాత సంక్రాంతి పండుగ నాడు సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తారని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రతిసారి ప్రభాస్ అభిమానుల ఆశలపై రాధేశ్యాం సినిమా యూనిట్ నీళ్లు చల్లడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తున్న పూజ హెగ్డే “రాధేశ్యాం” టీజర్ రిలీజ్ డేట్ వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14 వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ చేసినట్లు.. త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాతకాలం నాటి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలో ప్రేమికుల దినోత్సవం నాడు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే “బాహుబలి” తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన “సాహో” బోల్తాపడటంతో ‘రాధేశ్యామ్’ పై అంచనాలు ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున పెట్టుకున్నారు. ఇలా ఉంటే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫోటోలు చాలా వరకు కొత్త కూల్ లుక్ లో ఉండటంతో.. టీజర్ ఎలా ఉంటుందో అని ఆతృతతో అభిమానులు తెగ ఊహల లోకంలో తేలిపోతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?