Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ కి మేకర్స్ సన్నాహలు చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనున్నారు. అధికారకంగా ఈ సినిమా ఎప్పుడో వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ గనక లేకపోయి ఉంటే ఈ పాటికే సెట్స్ మీదకి రావాల్సింది.
కాగా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మేకర్స్ చిత్ర బృందాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరూ మాట్లాడుకుంది..ఇందులో నటించే హీరోయిన్ గురించి. బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటించనుందని, కియారా అద్వానీ అని, రష్మిక మందన్న అని, జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని..ఇలా చాలా వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమాలో పూజా హెగ్డే కన్ఫర్మ్ అవుతుందని చెప్పుకున్నారు.
Mahesh babu : మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో పూజా హెగ్డే
వారు అన్నదే నిజమయింది. మరోసారి మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే కలిసి వర్క్ చేయబోతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో చిత్రాలు చేసింది. ఇది హ్యాటిక్ సినిమా. ఇక మహేష్ బాబుతో ఇంతకముందు మహర్షి సినిమా చేసింది. ఆయనతో పూజాకి ఇది రెండవ సినిమా. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి తాజాగా టీజర్ వచ్చి సంచలనం సృష్ఠిస్తోంది.