టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్…చేసిన సినిమాల కంటే.. వివాదాస్పద వార్తలతో ఎక్కువ సంచలనమైంది. 2019 ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలను ఉద్దేశించి ప్రముఖంగా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే ఇటీవల విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంట్రవర్సీ కామెంట్లు చేయటాన్ని ఉద్దేశించి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించారు. ఒక వ్యక్తిని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ పూనమ్ కౌంటర్లు ఇస్తాది అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకాష్ రాజ్ దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న రైతులకు ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి పూనమ్ కూడా స్పందించటమే కాక ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ పై వేసిన డైలాగులను ఉద్దేశించి.. ప్రకాష్ సార్ ఏ యాక్టర్, పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడితే పెద్దపెద్ద హెడ్డింగులు వేసి చూపిస్తారు. కానీ తను రైతులకు మద్దతుగా మాట్లాడితే మాత్రం వాటిని హైలెట్ చేయకుండా కవర్ చేశారంటూ తెలుగు మీడియా పై మండిపడింది. దీంతో పూనమ్ కౌర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఊసరవెల్లి అంటూ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులను మాత్రమే కాక మెగా బ్రదర్ నాగబాబు ని సైతం నోచ్చుకునే విధంగా చేయడం మాత్రమే కాక ప్రకాష్ రాజ్ కి భారీగానే కౌంటర్లు పడ్డాయి. ఇలాంటి తరుణంలో పూనమ్ కౌర్.. ప్రకాష్ కీ సపోర్ట్ చేస్తూ మాట్లాడటం తో మెగా అభిమానులు ఆమె చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నట్లు టాక్ వస్తోంది.