ఢిల్లీ, జనవరి 7: అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతీ యువకులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు అవరోధంగా మారుతుంది. దీనిని తప్పించుకునేందుకు మొత్తం రిజర్వేషన్లను 50నుండి 60శాతం పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారు, వార్షిక ఆదాయం ఐదు లక్షలు లోపు ఉన్న వారిని ఈ రిజర్వేషన్కు అర్హులుగా నిర్ణయించారు.
previous post