కొద్ది రోజుల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త…. వైసిపి నాయకులు పొట్లూరి వర ప్రసాద్ హైదరాబాద్ పోలీసులు అతనిని విచారించేందుకు వస్తే వారిపై తన పెంపుడు కుక్కలను వదిలి నానా హంగామా చేసిన విషయం తెలిసిం ఆ తర్వాత అతను పారిపోయి విజయవాడ వచ్చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అతను తిరిగి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నట్లు తెలుస్తోంది.
ఆయన ఒక స్థల యజమానిని కొట్టారు అన్న ఆరోపణలు రాగా హైదరాబాదులోపొట్లూరి పై కేసు కూడా నమోదు చేశారు. అదే విషయమై పోలీసులు అతని ఇంటికి వెళ్లగా వర ప్రసాద్ వారిపై కుక్కలు వదిలినట్టు చెబుతున్నారు. అయితే ముండు నుండి ఆయన హైకోర్టు ఆదేశాలతో దాదాపు బయట ఉన్నారు కానీ ఆ ఘటన తర్వాత ఆయనను అరెస్టు చేయాలని కోర్టు సూచించిగా పీవీపి మాత్రం దొరకలేదు.
విజయవాడ తో సహా కొన్ని ప్రాంతాల్లో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు కానీ అతను అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నుంచి ఒత్తిడి పెరగడంతో ఉదయం 11 గంటలకు వర ప్రసాద్లొంగిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.