టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటులు రావికొండల రావు ఇకలేరు. బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. నటుడిగానే కాక దర్శకుడిగా, నిర్మాతగా, జర్నలిస్ట్ గా పనిచేసారు.
ఆయా రంగాలలో ఆయన విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశేష సేవలందించిన రావికొండల రావు 1958లో శోభ చిత్రంతో ఆయన తన సినీ అరంగేట్రం చేసారు. తెలుగు మాత్రమే కాకుండా ఆయన తమిళ, మలయాళ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పారు. రావికొండల రావు భార్య రాధా కుమారి 2012లో మృతి చెందారు. ఆమె టాలీవుడ్ బామ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. రావికొండల రావు మృతి టాలీవుడ్ కు తీరని లోటు అని చెప్పవచ్చు.