మరాఠీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే(47) గురువారం కన్నుమూశారు. పూణేలోని ఆయన నివాసంలో ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
వృత్తిరీత్యా నరేంద్ర భిడే సివిల్ ఇంజనీర్. ఈయన మరాఠీ సినీ పరిశ్రమలో అనతికాలంలోనే మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా ఈయన పాటలను అందరూ
ఎంజాయ్ చేస్తారు. డియోల్ బ్యాండ్, బయోస్కోప్,ఉబున్ టూ, పుష్పక్ విమాన్, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సరి వంటి ఎన్నో సినిమాలతో పాటు ఏ పేయింగ్ గోస్ట్ లాంటి నాటకాలకు కూడా అయన సంగీతం అందించారు
పుణేకు చెందిన స్టూడియో డాన్ ఇన్ఫోటైనమెంట్ లో కొంతకాలం డైరెక్టర్ గా పని చేశారు. అంతేకాక భిడే అనేక నాటకాలు, సీరియల్స్, సినిమాల ద్వారా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అయన కృషికి ఫలితంగా జీ గౌరవ్(5 సార్లు ), స్టేట్ డ్రామా అవార్డు(2 సార్లు) సహ్యాద్రి సినీ అవార్డు, వి శాంతారాం అవార్డు, శ్రీకాంత్ ఠాక్రే అవార్డు, స్టేట్ ఫిలిం అవార్డులను దక్కించుకున్నారు.
2015లోనే వచ్చిన ఏ పేయింగ్ గోస్ట్ లాంటి నాటకాలతో పాటు డియోల్ బ్యాండ్, బయోస్కోప్, ఉబూన్ టు, పుష్పక్ విమాన్, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారీ, ముల్షీ పాట్రన్ చిత్రాలకు మ్యూజిక్ డైరక్టర్గా పనిచేశాడు. సినిమాలే కాకుండా అనేక నాటకాలు, సీరియల్స్, జింగిల్స్తో తనదైన ముద్ర వేసుకున్నారు.
నరేంద్ర భిడే హఠాన్మరణంతో మరాఠీ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన లేని లోటు తీరనిదంటూ.. సినీ పరిశ్రమతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.