Posani Krishnamurali: రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన పరువు తీసే టట్టు పరిస్థితులు మార్చేసిన ట్లు.. టాలీవుడ్ అదేరీతిలో ఏపీ పాలిటిక్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి పవన్.. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ముందు మనం నీతిగా బతికి ఎదుటివాడికి చెబితే బాగుంటుంది.. అని పోసాని పేర్కొన్నారు. ఇదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పంజాబ్ రాష్ట్రం నుండి 16 సంవత్సరాల కలిగిన అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగువారు మంచి వాళ్లని ఇక్కడికి వచ్చింది.. ఒక ప్రముఖ వ్యక్తి ఇండస్ట్రీలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిని కడుపు చేసి.. బాగా వాడుకొని తర్వాత అబార్షన్ చేయించిన బెదిరించి నోరు మూయించేశరు. ఆ అమ్మాయి పేరు వివరాలు రహస్యంగా నీకు పంపుతా… అమ్మాయికి న్యాయం చేస్తే నీకు గుడి కట్టిస్తా.. నీకు పూజలు చేస్తా అంటూ పోసాని నిన్న మీడియా సమావేశం పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో మీడియా సమావేశం తర్వాత నిన్న రాత్రి నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు.. నా భార్య పై దారుణమైన కామెంట్ చేస్తూ ఉన్నారు అంటూ ఈ రోజు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో.. మీడియా సమావేశంలో పోసాని షాకింగ్ కామెంట్లు చేశారు. తన భార్య గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఇంట్లో పనిమనిషి తో తన భార్యకి అక్రమసంబంధం ఉన్నట్లు నోటికొచ్చినట్లు మెసేజ్లు పెడుతున్నారు అని ఫోన్ చేసి తిడుతున్నారు అని పోసాని తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు గురించి పోసాని మాట్లాడుతూ… ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వికృతి బుద్ధి గురించి మీడియా ముందు మాట్లాడటం జరిగిందని తెలిపారు. వ్యక్తిగత విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదని, ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ప్రశ్నించే హక్కు తనకు ఉందని పోసాని చెప్పుకొచ్చారు.
ఆ పంజాబీ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా..?
అబద్ధాల వల్ల ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని.. నేను మాట్లాడేది నిజాలే అంటూ పోసాని..వైరల్ కామెంట్స్ చేశారు. ఆ పంజాబీ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా..? ఆ అమ్మాయికి కడుపు చేయలేదా?, అబార్షన్ కి డబ్బులు ఇచ్చి పంపించ లేదా..? ఆ అమ్మాయి నోరు మూయించే లేదా..? .. నువ్వు ఒక బ్రోకర్ గాడివి, లోఫర్ గాడివి, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసిన.. దగుల్బాజీ గాడివి నువ్వు.., ఇటువంటి పనులు చేసే నువ్వు మా ఇళ్లలో ఆడవాళ్లపై… విమర్శలు చేస్తావా..??, ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి రావడం..?, సినిమాలో డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు వచ్చిన సమయంలో ఆయన నీ విమర్శించారు. కానీ ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఉండాల్సిన హుందాతనం అంటే అది. అసలు నీ బతుకుకి హుందాతనం.. తెలుసా అంటూ మీడియా ప్రెస్ క్లబ్ లో… పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు లోఫర్ గాడివి, ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశావు కానీ అప్పట్లో నేను నోరు తెరవలేదు. కానీ మా ఇంటి ఆడవాళ్ళు జోలి విషయం వచ్చారు కాబట్టి ఇప్పుడు.. నాకు బాధ కలిగి ఈ మాటలు చెబుతున్నారు అని పోసాని తన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఎంతో మంచిది అని అటువంటి ఆమెపై దారుణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇష్టానుసారంగా ఫోన్ లోకి మెసేజీలు చేస్తున్నారని, తన అభిమానుల చేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేస్తున్నారని పోసాని ఆరోపించారు.