Pawan Posani: తెలంగాణ బీజేపీ నేత మహిళా నాయకురాలు శ్వేతా రెడ్డి పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. బీజేపీతో జనసేన మిత్రపక్షమైన గాని ఒక మహిళకు అన్యాయం జరిగితే.. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని శ్వేతా రెడ్డి చెప్పుకొచ్చారు. మహిళలను కాపాడటం కోసం వీరలెవల్లో మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ముందుగా… ఆయన మోసం చేసిన పూనమ్ కౌర్ కి న్యాయం చేయాలని పోసాని చెప్పిన మాటలు వాస్తవమే అని శ్వేతారెడ్డి ఇ వీడియో సందేశం ద్వారా చెప్పుకొచ్చాడు. పంజాబీ అమ్మాయి పూనమ్ కౌర్ కి.. అవకాశాలు ఇప్పిస్తాను అని ఆమెకు కడుపు చేయడంతోపాటు అబార్షన్ చేయించడం.. తర్వాత ఆమెను భయబ్రాంతులకు గురి చేసి నోరు ముయించడం వంటి సెటిల్మెంట్ పై పవన్ నోరు తెరవాలని పోసాని చేసిన వ్యాఖ్యలలో.. తప్పు లేదని స్పష్టం చేశారు.
ఆ మీడియా సమావేశం పెట్టిన తర్వాత పోసానిని చంపేస్తాం తొక్కేస్తా నరికేస్తాం.. అని పవన్ ఫ్యాన్స్ వ్యవహరించడాన్ని శ్వేతా రెడ్డి ఖండించారు. తప్పు చేస్తే ఎవరైనా సమాధానం చెప్పాలి వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకోవాలి అని అన్నారు. ఎంత మందిని నరికేస్తున్నారు అంటూ పలువురు సినిమా ఇండస్ట్రీ పేర్లను శ్వేతా రెడ్డి వీడియోలో ప్రస్తావించారు. పూనం కౌర్ ని నమ్మించి మోసం చేసి.. ఆమె జీవితాన్ని ఎటూ కాకుండా చేశారని.. ప్రతి తెలుగు వాడికి తెలియని శ్వేతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో 2018లో పూనమ్ కౌర్… పవన్ కళ్యాణ్ తో ఫోన్ సంభాషణలో చేసిన వ్యాఖ్యలను శ్వేతా రెడ్డి గుర్తు చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ లో రాజకీయ సభలో మహిళా భద్రత కోసం ఆయన మాట్లాడే ముందు తనకి అన్యాయం చేశాడు ఆ విషయం గురించి ఏంటి అంటూ త్రివిక్రమ్ ని .. గతంలో పూనం కౌర్ .. ప్రశ్నించడాన్ని తాజాగా శ్వేతా రెడ్డి పూర్తి చేశారు.
పోసాని కృష్ణ మురళికి తన సపోర్టు
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు శ్వేతారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల అన్యాయం అయితే ప్రశ్నించారా.. కాస్త బుర్రపెట్టి ఆలోచించండి అని చెప్పుకొచ్చారు. ఇక ఇదే తరుణంలో తన ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో జరిగిన దానిని బట్టి పోసాని కృష్ణమురళి కూడా ఆ విధంగానే రియాక్ట్ అయ్యారు… ఖచ్చితంగా ఈ విషయంలో పోసాని కృష్ణ మురళికి తన సపోర్టు ఉందని తెలంగాణ బీజేపీ మహిళా నేత శ్వేతా రెడ్డి వీడియో సందేశం ద్వారా చెప్పుకొచ్చారు. ఎంతమందిని చంపేస్తారు పవన్ కళ్యాణ్ అభిమానులు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తే చంపేస్తారా… అంటూ సీరియస్ అయ్యారు.
చిరంజీవి గారేమో.. ఏపీ సీఎం జగన్ కి బొకేలు
మరో పక్క చిరంజీవి గారేమో.. ఏపీ సీఎం జగన్ కి బొకేలు ఇచ్చి హ్యాండ్ కలుపుతారు. ఇక ఇదే టైం లో పవన్ కళ్యాణ్ ఏమో జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారు అని అంటుంటారు. ఈ విధం గా వ్యవహరించే పవన్ కళ్యాణ్ కి చిరంజీవి గారు చెప్పాలి.. ఆయనకు ఎంతగానో అనుభవం ఉంది రాజకీయంగా బోల్తాపడిన ఫ్రెండ్స్ కూడా ఉందని శ్వేతా రెడ్డి చురకలంటించారు. నిజంగా దమ్ముంటే రాజకీయాలు చేయాలని లేకపోతే జనసేన పార్టీ అనే సూపర్ మార్కెట్ ను మూసుకోవాలని .. పవన్ కళ్యాణ్ కి చిరంజీవి చెప్పాలని శ్వేతా రెడ్డి తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక ఖచ్చితంగా ఇటువంటి విషయాలపై ప్రశ్నిస్తారు అని స్పష్టం చేశారు.