వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు తెరపైకి తీసుకు రావడంతో ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఒకపక్క ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. మరోపక్క అధికారంలో ఉన్న వైసిపి పార్టీ అభివృద్ధి ఒక చోట మాత్రమే కేంద్రీకృతమవుతే కచ్చితంగా హైదరాబాద్ కోల్పోయిన పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతుందని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో ఏపీ రాజధాని విషయంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు న్యాయస్థానాల వరకు వెళ్లి మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు పడిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మూడు రాజధానులు తీసుకురావాలని మొండి పట్టు మీద ఉన్న జగన్ టీం కి మోడీ సర్కార్ ఆశలు రేపినట్లు టాక్ వస్తోంది.
మేటర్ ఏమిటంటే అమరావతి నుండి విశాఖ కు రాజధాని తరలించడానికి ప్రభుత్వానికి అధికారం లేదు అంటూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తో కొంతమంది న్యాయస్థానానికి వెళ్లటం.. అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విషయంలో అదేవిధంగా రాజధాని పేరు చెప్పి ప్రభుత్వం కడుతున్న కొత్త భవనాల విషయంలో స్టే ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” అనగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకచోట తీసుకురావటం, కొత్త పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయం లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పేరిట కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. సేమ్ టు సేమ్ ఏపీ రాజధాని విషయంలో న్యాయస్థానములో వేసిన ప్రజాప్రయోజనం తరహాలోనే “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” విషయంలో కూడా వేయడం జరిగింది. పర్యావరణం, సహజ వాతావరణం దెబ్బతింటుంది పేరుతో వేసిన వ్యాజ్యం విషయంలో దాన్ని తోసిపుచ్చుతూ తాజాగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” వచ్చిన తీర్పును ఆధారం చేసుకుని జగన్ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్ట్ కి లేదా హైకోర్టుకు అయినా వెళ్లే అవకాశం ఉందని, ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను తరలించే విషయంలో న్యాయస్థానాలకు ఏమాత్రం అధికారం లేదు అన్నట్టుగా..ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉండాలో న్యాయస్థానాలు ఎలా డిసైడ్ చేస్తాయి, అనే విధంగా ఏపీ ప్రభుత్వం న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉండాలి అనేవి ఆ శాఖకు సంబంధించిన విషయమని, ప్రభుత్వాలు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయా లేదా కరెక్ట్ గా చేస్తున్నాయా అన్నది మాత్రమే న్యాయస్థానం పరిధిలో తేల్చుకునే అంశమని మేధావులు చెప్పుకొస్తున్నారు. దీంతో వైసిపి ప్రభుత్వం “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” విషయంలో వచ్చిన తీర్పు బట్టి న్యాయస్థానాలలో వాదించే అవకాశం ఉందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. మూడు రాజధానులు విషయంలో ఇది ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకు పాజిటివ్ న్యూస్ అని పేర్కొంటున్నారు.