NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధాని విషయంలో జగన్ సర్కార్ కి పాజిటివ్ వార్త..!!

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు తెరపైకి తీసుకు రావడంతో ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఒకపక్క ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. మరోపక్క అధికారంలో ఉన్న వైసిపి పార్టీ అభివృద్ధి ఒక చోట మాత్రమే కేంద్రీకృతమవుతే కచ్చితంగా హైదరాబాద్ కోల్పోయిన పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతుందని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Chief Minister YS Jagan Mohan Reddy to visit Vizag todayఈ క్రమంలో ఏపీ రాజధాని విషయంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు న్యాయస్థానాల వరకు వెళ్లి మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు పడిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మూడు రాజధానులు తీసుకురావాలని మొండి పట్టు మీద ఉన్న జగన్ టీం కి మోడీ సర్కార్ ఆశలు రేపినట్లు టాక్ వస్తోంది.

 

మేటర్ ఏమిటంటే అమరావతి నుండి విశాఖ కు రాజధాని తరలించడానికి ప్రభుత్వానికి అధికారం లేదు అంటూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తో కొంతమంది న్యాయస్థానానికి వెళ్లటం.. అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విషయంలో అదేవిధంగా రాజధాని పేరు చెప్పి ప్రభుత్వం కడుతున్న కొత్త భవనాల విషయంలో స్టే ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” అనగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకచోట తీసుకురావటం, కొత్త పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయం లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పేరిట కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. సేమ్ టు సేమ్ ఏపీ రాజధాని విషయంలో న్యాయస్థానములో వేసిన ప్రజాప్రయోజనం తరహాలోనే “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” విషయంలో కూడా వేయడం జరిగింది. పర్యావరణం, సహజ వాతావరణం దెబ్బతింటుంది పేరుతో వేసిన వ్యాజ్యం విషయంలో దాన్ని తోసిపుచ్చుతూ తాజాగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” వచ్చిన తీర్పును ఆధారం చేసుకుని జగన్ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్ట్ కి లేదా హైకోర్టుకు అయినా వెళ్లే అవకాశం ఉందని, ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను తరలించే విషయంలో న్యాయస్థానాలకు ఏమాత్రం అధికారం లేదు అన్నట్టుగా..ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉండాలో న్యాయస్థానాలు ఎలా డిసైడ్ చేస్తాయి, అనే విధంగా ఏపీ ప్రభుత్వం న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉండాలి అనేవి ఆ శాఖకు సంబంధించిన విషయమని, ప్రభుత్వాలు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయా లేదా కరెక్ట్ గా చేస్తున్నాయా అన్నది మాత్రమే న్యాయస్థానం పరిధిలో తేల్చుకునే అంశమని మేధావులు చెప్పుకొస్తున్నారు. దీంతో వైసిపి ప్రభుత్వం “సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్” విషయంలో వచ్చిన తీర్పు బట్టి న్యాయస్థానాలలో వాదించే అవకాశం ఉందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. మూడు రాజధానులు విషయంలో ఇది ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకు పాజిటివ్ న్యూస్ అని పేర్కొంటున్నారు.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju