Post office: పొదుపు స్కీంలలో పేదలకు ఎప్పుడూ రీజనబుల్గా ఉండేది పోస్టాఫీస్ మాత్రమే. ఇందులో చాలా రకాలు పథకాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఈ స్కీమ్స్లో ధైర్యంగా పెట్టుబడి పెట్టొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ సైతం పొందొచ్చు. అయితే ఈ స్కీమ్స్ (schemes)అన్నింటిలో మంథ్లీ ఇన్ కమ్ పథకం బాగా ఆకట్టుకుంటోంది. మరి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా?
Post office :ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో లక్షలు మీ సొంతం …!
ఒకే సారి డబ్బులు పెట్టాలి
పోస్టాఫీస్ అందించే మంథ్లీ ఇన్కమ్ స్కీమ్లో చేరిత ఎవ్రీ మంత్ డబ్బులు పొందొచ్చు. మూడు నెలలు లేదా ఆరునెలలు, లేదా ఏడాదికి ఒక సారి డబ్బులు తీసుకోవచ్చు.కానీ ఇందులో ముందుగానే ఒకే సారి డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి. ఐదేండ్లలో ఈ స్కీం మెచ్చురిటీ అవుతుంది. ఈ టైంలో మీరు పెట్టిన పెట్టుబడికి వడ్డీ (interest)లభిస్తుంది.
Post Office Scheme: సీనియర్ సిటిజెన్స్ కు పోస్టల్ శాఖ బంపర్ స్కీమ్..! అయిదేళ్ల తర్వాత రూ.15 లక్షలు అందుకోవచ్చు ఇలా..!!
రూ.వెయ్యి మొదలుకుని…
వెయ్యి రూపాయలు మొదలుకుని ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా 4 లక్షల 50 వేల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పరిమితి ఒక్కరికే వర్తిస్తుంది. భార్యభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్(join account) ఓపెన్ చేస్తే రూ.9 లక్షల వరకు పెట్టబడి పెట్టొచ్చు. ఈ స్కీంలో ప్రస్తుతం 6.6 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. చిన్న సేవింగ్ స్కీం వడ్డీ రేట్ల విషయంలో కేంద్రం ప్రతి మూడునెలలకు ఓ సారి సవరణ చేస్తూనే ఉంటుంది. దీని వల్ల వడ్డీ రేట్ల విషయంలో మార్పులు జరుగుతుంటాయి. దంపతులు ఈ స్కీంలో జాయింట్గా ఖాతా ఓపెన్ చేసి రూ.9 లక్షలు ఒక్కసారే పెట్టుబడి పెడితే ఏడాదికి 60 వేల రూపాయలు పొందొచ్చు. అంటే.. ప్రతి నెలా రూ.5వేలు పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. దగ్గరలోని పోస్టాఫీస్ కు వెళ్లి వివరాలు తెలుసుకోండి మరి.. ఇంకా మరిన్ని పోస్టాఫీస్ స్కీంలకు సంబంధించి మీ ఊర్లో ఉన్న పోస్టాఫీస్ సిబ్బందిని సంప్రదించండి.