దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టాఫీసులో గ్రామీణ డాక్ సేవక్ లుగా పని చేసేందుకు గాను ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. మొత్తం 2582 ఈ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ ఉద్యోగాలకు గాను ఎటువంటి రాత పరీక్ష గాని ఇంటర్వ్యూను గాని నిర్వహించడం లేదు. కేవలం పదవ తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు కేటాయిస్తున్నారు.
ఎంపిక విధానం :
ఈ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. వయసు 18 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 40 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రత్యేక వయసు పరిమితిలో మినహాయింపులు ఉంటాయి. పదవ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్లో ఇంగ్లీష్ తో పాటు గణితం, స్థానిక భాష ఒక సబ్జెక్టుగా చదివి, వాటిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పదో తరగతి లో పాస్ అయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పదవ తరగతి కన్నా ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు కేటాయిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు రూ.12000-14,500 ప్రారంభంలో వేతనంగా చెల్లిస్తారు. అదే గ్రామీణ్ డాక్ సేవక్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఉద్యోగాలకు అయితే రూ.10000-12000 చెల్లించనున్నారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 12/11/2020.
చివరి తేదీ :11/12/2020.