పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా బోనీకపూర్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పూర్త్వాల్సిన ఈ సినిమా 80 శాతం షూటింగ్ జరిగాక ఆగిపోయింది.
అయితే గత కొన్ని రోజులుగా యూనిట్ అందరూ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసమే ఎదురు చూశారు. ఆయన పాల్గొనాల్సిన కొన్ని కీలక సన్నివేశాలు మినహా మిగతా టాకీపార్ట్ మొత్తం కంప్లీటవడం తో ఆ కాస్త షూటింగ్ ని ఫినిష్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ టాకీపార్ట్ ను అక్టోబర్ 23న నుండి మొదలుపెట్టి డిసెంబర్ లోపు పూర్తి చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఇందుకోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ ను కేటాయించాడని సమాచారం.
వకీల్ సాబ్ 20 రోజుల షూట్ ను కంప్లీట్ చేసి 2021 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట దిల్ రాజు. ఈ లోపు ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో భారీగా అంచాలు పెంచేదుకు ప్లాన్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రిష్ – పవన్ సినిమా జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళనుంది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ లోపు పూర్తి చేసి పవన్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రావాలని క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడట. ఇక వచ్చే విజయదశమి పండుగ సందర్భంగా పవన్ – క్రిష్ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ రెండు సినిమాల తర్వాత పవర్ స్టార్ తన 28వ సినిమాని హరీష్ శంకర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన హిందీ దబాంగ్ రీమెక్ ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ వీటితో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా కమిటయిన విషయం తెలిసిందే.