అయ్యప్పన్ కోషియమ్… మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమా. ఈ సినిమాలో బీజూ మీనన్ – పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. సినిమా మొత్తం ఈ ఇద్దరి హీరోల మధ్య నే సాగుతుంది. ఇద్దరిది నువ్వా నేనా అన్నట్టు సాగే పాత్రలు. ఆ పాత్రలకి బీజూ మీనన్ – పృథ్విరాజ్ 100 కి 100 శాతం న్యాయం చేశారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అధికారక ప్రకటన వెలువడింది.
సాగర్ క్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజూ మీనన్ పోషించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా కి సంబంధిచిన కొన్ని కీలక విషయాలని మేకర్స్ సస్పెన్స్ లో ఉంచుతున్నారు. ముఖ్యంగా అయ్యప్పన్ గా పవర్ స్టార్ నటిస్తుండగా కోషి పాత్రలో మరో హీరోగా ఎవరు నటిస్తాడన్న క్లారిటీ ఇవ్వడం లేదు. కాని ఈ మధ్య దర్శకుడు మాత్రం త్వరలో రానా వద్దకి వెళ్ళి ఫైనల్ వెర్షన్ చెప్పాల్సి ఉంది.
ఆ వెర్షన్ గనక రానా కి నచ్చితే అఫీషియల్ గా రానా ని అనౌన్స్ చేస్తామని వెల్లడించాడు. అయినా రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే విజయ్ సేతుపతి, సుదీప్, సోనూసూద్ అంటూ వార్తలు వచ్చాయి. కాగా తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే గత కొంత కాలంగా గోపీచంద్ కి సరైన హిట్ దక్కలేదు. పైగా పవర్ స్టార్ ఇమేజ్ కి గోపీచంద్ సెట్ అవడన్న మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. ఇకా చెప్పాలంటే ఈ సినిమాలో గోపీచంద్ వద్దంటున్నారట. అయితే ఇవన్ని రూమర్స్ తప్ప వాస్తవాలు కాదని సమాచారం. ప్రస్తుతం రానా తప మరో ఆప్షన్ ని మేకర్స్ అనుకోవడం లేదట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!