ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ చేస్తున్న రెండవ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ కు అందరి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ముదటి నుంచి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేయబోతున్నారు అని. కాని ఈ సినిమా టైటిల్ ఏమిటి అన్నది ఇప్పటి వరకు యూనిట్ రివీల్ చేయలేదు. కానీ ప్రచారంలో మాత్రం మూడు టైటిల్స్ ఈ సినిమాకి పరిశీలనలో ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. గజదొంగ, బందిపోటు టైటిల్స్ తో పాటు ‘విరూపక్ష’ అన్న టైటిల్ ఇప్పటి వరకు ప్రచారంలో ఉండగా తాజాగా “ఓం శివమ్” అనే మరో టైటిల్ వైరల్ అవుతోంది.
అయితే ముందు వినిపించిన మూడు టైటిల్స్ లో ‘విరూపక్ష’ కు మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్ టైటిల్ ‘ఓం శివమ్’ కి ఊహించని విధంగా అభిమానులు, ప్రేక్షకుల తోపాటు కొంతమంది సినీ ప్రముఖుల నుంచి సూపర్బ్ అన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. నాలుగు టైటిల్స్ లో ‘ఓం శివమ్’.. ఫస్ట్ ప్లేస్.. విరూపక్ష.. సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ రెండు టైటిల్స్ లో దాదాపు ‘ ఓం శివమ్ ‘ ఫిక్స్ చేస్తారని అంటున్నారు.
అయినప్పటికీ ఇంకా పవర్ ఫుల్ టైటిల్ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీసూర్య మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.